• హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
No Result
View All Result
Home పాలిటిక్స్

రాజమండ్రి మహానాడులో టీడీపీ ఎన్నికల శంఖారావం పూరిస్తుందా?

sastra_admin by sastra_admin
May 27, 2023
in పాలిటిక్స్, రాజమండ్రి
0 0
0
రాజమండ్రి-మహానాడులో-టీడీపీ-ఎన్నికల-శంఖారావం-పూరిస్తుందా?

హోమ్ ఆంధ్రప్రదేశ్ &nbsp/ రాజమండ్రి Mahanadu News Live Updates: రాజమండ్రి మహానాడులో టీడీపీ ఎన్నికల శంఖారావం పూరిస్తుందా?

Contents

  • 1 Mahanadu News Live Updates: రాజమండ్రి మహానాడులో టీడీపీ ఎన్నికల శంఖారావం పూరిస్తుందా?
  • 2 Mahanadu News Live Updates: రాజమండ్రిలో జరిగే మహానాడుకు సంబంధించిన లైవ్‌ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఈ పేజ్‌ను ఫాలో అవ్వండి.
          • 2.0.0.0.1 Background

Mahanadu News Live Updates: రాజమండ్రి మహానాడులో టీడీపీ ఎన్నికల శంఖారావం పూరిస్తుందా?

Mahanadu News Live Updates: రాజమండ్రిలో జరిగే మహానాడుకు సంబంధించిన లైవ్‌ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఈ పేజ్‌ను ఫాలో అవ్వండి.

By : PapeeDabba Desam | Updated: 27 May 2023 08:16 AM (IST)

Background

 Mahanadu News Live Updates:  రాజమండ్రి వేమగిరి వద్ద తెలుగుదేశం పార్టీ చేపట్టిన మహానాడు కార్యక్రమం సర్వాంగ సుంద‌రంగా, అంగరంగ వైభవంగా, కనీవినీ ఎరుగని రీతిలో ముస్తాబు చేసింది టీడీపీ. ఈసారి ప్రతినిధుల సభ, బహిరంగ సభ వేర్వేరుగా ఏర్పాటు చేశారు. మహానాడు తొలిరోజు ప్రతినిధుల సభ ఉంటుంది. ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి, తెలంగాణ నుంచి ముఖ్యనాయకులు, ప్రతినిధులు హాజరవుతారు. ప్రతినిధుల సభకు 15,000 మందిని ఆహ్వానించారు. 

నాలుగేళ్లలో జగన్ రాష్ట్రంలో చేస్తున్న విధ్వంసకర విధానాలను ప్రజలకు తెలియజేస్తామంటున్నారు టీడీపీ శ్రేణులు. నూటికీ నూరు శాతం టీడీపీ అధికారంలోకి వస్తుందని ధీమాతో ఉన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని ఏవిధంగా గాడిలోకి పెట్టాలి, పెట్టుబడులు పెట్టేందుకు ఎటువంటి నమ్మకాన్ని ఇవ్వాలని ప్రధానమైన ఉద్దేశ్యంతో మొదటి రోజు సభ జరుగుతుందన్నారు. 

అయిదు వింగ్‌లుగా తీసుకుని టీడీపీ బ్యాక్‌బోన్‌గా ఉన్నటువంటి బీసీల గురించి, దీంతోపాటు ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు సంక్షేమం గురించి, యువత, మహిళలు, రైతులు గురించి ప్రత్యేక దృష్టిసారించినట్లు టీడీపీ నాయకులు చెబుతున్నారు. వీటిపై ప్రత్యేక తీర్మానాలు ప్రవేశ పెట్టనున్నారు. 

మ్యానిఫెస్టో విడుదల లేనట్లేనా..టీడీపీ ఎన్నికల మ్యానిఫేస్టో ఎలా ఉండబోతుందో అధినేత చంద్రబాబు వివరించే ఛాన్స్ ఉందంటున్నారు టీడీపీ నాయకులు. రాబోయే విజయదశమి రోజున మ్యానిఫెస్టో ముసాయిదా విడుదల చేసి ప్రజల ముందు ఉంచుతారని చెబుతున్నారు. ప్రజల అభిప్రాయం తీసుకుని ఎన్నికల మ్యానిఫెస్టోను రూపకల్పన చేయబోతున్నారు. ప్రసంగికులు విషయంలో కూడా పాత కొత్త కలయికతో అవకాశం కల్పించనున్నారు. 

తెలుగుదేశం పార్టీ మహానాడు ఫెయిల్‌ అవ్వాలని ప్రభుత్వం అడుగడుగునా అనేక ఆటంకాలు సృష్టిస్తోందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. బస్సులు ఇవ్వడం లేదని, ప్రైవేటు వాళ్లు ఇస్తామంటే భయపెడుతున్నారన్నారు. ఆటోవాళ్ల మీద కేసులు పెడుతున్నారన్నారు. అందుబాటులో ఏ వాహనాలుంటే వాటిపై రావాలని లేకుండా కాలినడకన అయినా తరలిరావాలన్నారు. 

రాజమండ్రి సిటీ అంతా పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు, తోరణాలు కట్టుకుంటే రాత్రికి రాత్రి జగన్మోహన్‌రెడ్డి బ్లేడ్‌ బ్యాచ్‌ ఆటంకాలు సృష్టిస్తుందన్నారు అచ్చెన్న. ప్రజాస్వామ్యంలో పోలీసుల పాత్ర చాలా కీలకమని, జడ్‌ఫ్లస్‌ సెక్యూరిటీ కలిగిన చంద్రబాబు వస్తున్న సభకు ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా బందోబస్తు నిర్వహించాలని కోరారు. తాను డీజీపీకు లేఖ రాశానని, జిల్లా ఎస్పీనీ పార్టీ నాయకులు కలిశారని తెలిపారు. 

శుక్రవారం సాయంత్రం పొలిట్‌ బ్యూరో సమావేశం జరిగింది. రెండు రోజుల పాటు జరగనున్న మహానాడులో తీసుకోబోతున్న నిర్ణయాలు, ప్రవేశపెడుతున్న తీర్మానాలపై చర్చించారు. ఆమోదం తెలిపారు. 

రెండో రోజు భారీ బహిరంగ సభ నిర్వహించున్నారు. దీనికి ఏపీ, తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల నుంచి సుమారు 15లక్షల మంది జనాభా తరలివస్తారని అంచనా వేస్తున్నారు. దీని కోసం ప్రతీ కార్యకర్త ఒక వాలంటీర్‌గా మారి సేవలందిస్తారన్నారు అచ్చెన్న. మహానాడు అయ్యాక బాదుడే బాదుడేతోపాటు మరిన్ని సరికొత్త కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లి ఎన్నికల సంఖారావంపూరిస్తామని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.  

మహానాడుపై అధికార పార్టీ వైసీపీ కుట్ర చేస్తోందని ఆరోపిస్తోంది టీడీపీ. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు రాకుండా అడ్డుపడుతోందని అచ్చెన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు బస్సు, స్కూల్ బస్సులు ఇవ్వకుండా చేస్తున్నారని విమర్శించారు. ఎన్ని ఆటంకాలు సృష్టించిన జనం రాజమండ్రి వచ్చితీరుతారన్నారాయన. మహానాడుకు తరలి వచ్చే ప్రజలు, పార్టీ శ్రేణుల కోసం ప్రత్యేక భోజన ఏర్పాటు చేశారు. తొలి రోజు యాభై వేల మంది వస్తారని అంచనాతో వంటకాలు సిద్ధం చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్ర వరకు ఎప్పుడు వచ్చినా తినేలా వంటకాలు రెడీ అవుతున్నాయి. గోదావరి వంటకాలు రెండు రోజుల పాటు అతిథులను మైమరిపింపజేయనున్నాయి. 

Tags: atchannaiduChandrababuLokeshmahanadumahanadu 2023RajhamundryTelugu Desam Partyరాజమండ్రి

Recent Posts

  • తెలంగాణలో బీజేపీ- టీడీపీ కలిస్తే ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
  • రణబీర్ కపూర్ మంచి మనసు – వారికి
  • తన రిసెప్షన్ కు రావాలని కేసీఆర్ కు ఆహ్వానం అందించిన శర్వానంద్
  • చీరకట్టులో కృతి శెట్టి వయ్యారాలు
  • విజయ్ ‘లియో’లో కమల్ హాసన్ – లోకేష్ కనగరాజ్ కొత్త ప్లాన్?

Recent Comments

  1. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  2. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  3. pd_admin on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  4. Gopal on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  5. Bhanu Gopal Ch on రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిపై మరోసారి చట్టం చేసే అధికారం లేదు…
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

No Result
View All Result
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In