• హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
No Result
View All Result
Home హైదరాబాద్

పుణె నుంచి Hydకి కరడుగట్టిన దొంగల ముఠా! ఉండేది ఇక్కడే: సైబరాబాద్ పోలీసులు

sastra_admin by sastra_admin
April 12, 2023
in హైదరాబాద్
0 0
0
పుణె-నుంచి-hydకి-కరడుగట్టిన-దొంగల-ముఠా!-ఉండేది-ఇక్కడే:-సైబరాబాద్-పోలీసులు

హైదరాబాద్‌లోని సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు దొంగల ముఠాను ముందుగానే పసిగట్టి నేరాలను అదుపు చేయగలిగారు. పుణెకు చెందిన ఐదుగురు అంతరాష్ట్ర దొంగల ముఠా నగరానికి వచ్చినట్లుగా సైబరాబాద్ పోలీసులు తెలిపారు. నగరంలోని బంగారు దుకాణాలను టార్గెట్ గా చేసుకుని వీరు చోరికి పాల్పడేందుకు వచ్చారని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. దీనికి సంబంధించి స్టీఫెన్ రవీంద్ర, పోలీసు ఉన్నతాధికారులు కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పుణె నుంచి వచ్చిన దొంగలను పట్టుకున్నామని చెప్పారు. వారిని మీడియా ఎదుట నిలబెట్టారు.

పుణె నుండి రైలు మార్గంలో వీరు హైదరాబాద్ కు వచ్చి నగరంలోని జీడిమెట్ల ప్రాంతంలో ఉంటున్నట్లుగా పోలీసులు చెప్పారు. లాడ్జ్ లలో షెల్టర్ తీసుకుంటే పోలీసులకు అనుమానం వస్తుందనే ఉద్దేశంతో జీడిమెట్లలోని ఒక నిర్మాణంలో ఉన్న భవనంలో షెల్టర్ తీసుకున్నారని అన్నారు. వీరు కొన్నాళ్ల క్రితం సంగారెడ్డిలోని గుమ్మడిదల గ్రామంలో ఒక టాటా ఏస్ వాహనాన్ని చోరీ చేశారని చెప్పారు. చోరీకి పాల్పడ్డ తరువాత ఈ టాటా ఏస్ వాహనంలో పారిపోయేందుకు ప్లాన్ చేసుకున్నారని చెప్పారు. మహారాష్ట్రలో చోరీకి పాల్పడిన బంగారాన్ని సైబరాబాద్ లో విక్రయించి లక్ష రూపాయలు పొందారని వివరించారు. 

దొంగతనాల కోసం ప్రత్యేక పనిముట్లుదొంగతనాలు చేయడం కోసం నిందితులు తమ వద్ద ప్రత్యేక పనిముట్లను తీసుకువచ్చారని పోలీసులు చెప్పారు. ప్రత్యేకంగా వంచిన, ఓవైపు పదునుగా ఉన్న ఐరన్ రాడ్ లు, తల్వార్‌లు, టోపీలు, తుపాకులు, స్క్రూడ్రైవర్లు, పట్టుకార్లు తదితర సామగ్రిని వీరు వెంట ఉంచుకున్నారని వివరించారు. కొన్ని బంగారు దుకాణాలలో చోరీ చేసేందుకు వీరు రెక్కీ కూడా నిర్వహించారని అన్నారు. 

పక్కా సమాచారంతోనే గుర్తింపు‘‘మాకు పక్క సమాచారం వచ్చింది. నిందితులు ఉన్న ప్రదేశంలో పోలీసులు దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ అయిదుగురు నిందితులు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్. ఈ ముఠాపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో మొత్తం 175 కేసులు నమోదయ్యాయి. ఈ కరుడు గట్టిన ముఠాను అరెస్ట్ చెయ్యడంతో నగరంలో సెన్సేషనల్ కేసులు నమోదు కాకుండా అరికట్టగలిగాం. ఈ అయిదుగురు నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తాం. నిందితుల వద్ద నుండి మూడు కంట్రీ మేడ్ తుపాకులు, ఆరు రౌండ్ల బుల్లెట్‌లు, నగదు, ఐరన్ రాడ్‌లు స్వాధీనం చేసుకొని సీజ్ చేశాం’’ అని పోలీసులు తెలిపారు.

Tags: Cyberabad PoliceHyderabad Newspune thievesstephen ravindrathieves in hyderabadహైదరాబాద్

Recent Posts

  • ఒడిశాలో ప్రమాదానికి గురైన మార్గంలో సర్వీస్‌లు పునఃప్రారంభం- రైల్వే మంత్రి భావోద్వేగం
  • వేసవిలో తాటి ముంజలను తప్పనిసరిగా ఎందుకు తినాలి?
  • రావిచెట్టును పూజిస్తే శ‌ని అనుగ్ర‌హం ఖాయం
  • తెలుగుదేశంతో పొత్తుపై బండి మాటేంటి? జయహో RRR అంటున్న స్పైడర్‌మ్యాన్
  • డయాబెటిస్ ఉంటే ఈ పండ్లు అధికంగా తినకూడదు

Recent Comments

  1. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  2. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  3. pd_admin on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  4. Gopal on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  5. Bhanu Gopal Ch on రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిపై మరోసారి చట్టం చేసే అధికారం లేదు…
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

No Result
View All Result
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In