- జగనన్నే మా భవిష్యత్తు పేరుతో ప్రతి గడపకూ ప్రచారం.
- మార్చి 18 నుంచి 26 వరకూ కూడా జగనన్నే మా భవిష్యత్తు క్యాంపెయిన్.
- గడప, గడపకూ వైయస్సార్సీపీ సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు.
- 5.65 లక్షల మంది సచివాలయ కన్వీనర్లు, గృహసారధులతో కూడిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సైన్యం.
- 1.65 కోట్ల గృహాల సందర్శన.
- గడపగడపకూ కార్యక్రమం అత్యంత కీలకం.
- నిర్దేశించుకున్న విధంగా ఈ కార్యక్రమాన్ని పూర్తిచేయాలి.
మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులతో సీఎం వైయస్.జగన్ సమావేశం.
- పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేసిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్.
- రాబోయే రోజుల్లో పార్టీ పరంగా ప్రారంభించనున్న కార్యక్రమాలపై దిశానిర్దేశం చేసిన సీఎం
- 93 శాతం గృహసారథుల నియామకం పూర్తయ్యింది
- దాదాపు 5 లక్షల మంది గృహసారథులను నియమించుకున్నాం.
- ఫిబ్రవరి 16 లోగా అక్కడక్కడా మిగిలిపోయిన నియామకాలను పూర్తిచేయాలి
- పార్టీకార్యక్రమాలు నిరంతరరాయంగా జరగాలంటే గృహసారథులనేవాళ్లు చాలా ముఖ్యమైనవారు.
- గృహసారథులు, సచివాలయ కన్వీనర్ల మొదటి బ్యాచ్కు శిక్షణ కార్యక్రమాలు 387 మండలాల్లో ముగిశాయి.
- రెండో బ్యాచ్కు శిక్షణ కార్యక్రమాలు మిగిలిన మండలాల్లో రేపటి నుంచి ప్రారంభమై, ఫిబ్రవరి19 వరకూ నడుస్తాయి.
- మండలాల వారీగా జరిగే ఈ శిక్షణ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పాల్గొనాలి.
- ఈ శిక్షణ కార్యక్రమాలు ముగిసిన తర్వాత క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలి:
- సచివాలయ కన్వీనర్లు, గృహసారథుల రూపేణా వైయస్సార్ కాంగ్రెస్పార్టీకి సుమారు 5.65 లక్షలమందితో క్షేత్రస్థాయిలో పార్టీ సైన్యం ఉంది
- వీరంతా జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొంటారు.
- దాదాపు 1.65 కోట్ల గృహాలను సందర్శిస్తారు
- మార్చి 18 నుంచి 26 వరకూ కూడా జగనన్నే మా భవిష్యత్తు క్యాంపెయిన్ను పార్టీకి చెందిన సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు డోర్ టు డోర్ నిర్వహిస్తారు.
- గత ప్రభుత్వం కన్నా.. ఈ ప్రభుత్వం అందించిన మెరుగైన పాలన, అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తారు.
- గృహసారథులను కో–ఆర్డినేట్ చేసే బాధ్యతను సచివాలయ కన్వీనర్లకు అప్పగించాలి.
- గడప గడపకూ మన ప్రభుత్వంపైన కూడా ముఖ్యమంత్రి సమీక్ష.
- ఇప్పటివరకూ దాదాపు 7447 సచివాలయాల్లో గడపగడపకూ కార్యక్రమం నిర్వహణ.
- సగటున నెలలో సుమారు 6 సచివాలయాలను సందర్శించిన ఎమ్మెల్యేలు.
- గడపగడపకూ కార్యక్రమం నిర్వహణ అత్యంత కీలకమని మరోసారి స్పష్టంచేసిన సీఎం
- నిర్దేశించుకున్న విధంగా ఈ కార్యక్రమాన్ని పూర్తిచేయాలన్న సీఎం.
- ప్రతి ఇంట్లో ఉన్నవారిని కూడా పలకరించి వారితో కొంత సమయం గడపాలన్న సీఎం.
- సుమారు 14 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి:
- టీడీపీకి బాకా ఊదుతున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 లాంటి వ్యక్తులతో యుద్ధం చేస్తున్నాం.
- ఉన్నది లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా అవి చూపిస్తున్నాయి.
- ప్రజలకు నిరంతరం ఏదో ఒక భ్రమ కల్పించే పనులు చేస్తున్నాయి.
- వీటిని తిప్పికొడుతూ మనం ముందుకు సాగాలి.
- గ్రాడ్యుయేట్లు, టీచర్లకు సంబంధించిన 5 ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి: సీఎం
- జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల పరిశీలకులు వీరంతా కలిసికట్టుగా పనిచేయాలన్న సీఎం.