- లోకేశ్కు ప్రాణ హాని ఉంది..!ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు సృష్టిస్తున్నారు..!
- టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్సీ, నారా లోకేశ్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర భద్రత లోపాలపై.. టీడీపీ నేతలు గవర్నర్ను కలిశారు.
- రాజ్భవన్లో గవర్నర్ను కలిసిన నేతలు పోలీసులు సృష్టిస్తున్న అడ్డంకులను, వైసీపీ నాయకుల తీరును గవర్నర్కు వివరించారు.
- లోకేశ్ యువగళం పాదయాత్రలో ప్రాణహాని తలపెట్టే కుట్రలను వైసీపీ పన్నుతోందని తెలుగుదేశం పొలిట్బ్యూరో సభ్యులు గవర్నర్ను కలిసి ఫిర్యాదుచేశారు.
- కొల్లు రవీంద్ర, నక్కా ఆనంద్ బాబు, బోండా ఉమా, వర్ల రామయ్యలు రాజ్భవన్లో గవర్నర్ను కలిశారు.
- నిఘా ముసుగులో పోలీసులు డ్రోన్ల ద్వారా లోకేష్ లేని చోట చిత్రీకరిస్తున్న దృశ్యాలను గవర్నర్కు అందించారు.
- నారాలోకేష్ పాదయాత్రకు పోలీసులు ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ గవర్నర్కు విన్నవించారు.
- ఈ సమస్యలపై డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు అవకాశం రానందున.. డీజీపీని కలిసే అవకాశం కల్పించమని గవర్నర్ను కోరారు.
- పోలీసులు అడుగడుగునా పాదయాత్రకు అడ్డంకులు సృష్టించటం, ప్రజలతో మాట్లాడకుండా మైక్ నియంత్రించడం, కేసుల నమోదు, వాహనాలు సీజ్ వంటి పరిణామాలు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.
- ఇప్పటి వరకు సుమారు 20సార్లు ఫిర్యాదు చేశామని.. న్యాయం జరగలేదని గవర్నర్కు వివరించారు.
- లోకేశ్కు ప్రాణహాని ఉందని గవర్నర్కు తెలిపారు. సజ్జల రామకృష్ణరెడ్డి కుమారుని ఆధ్వర్యంలో వైసీపీ సోషల్ మీడియా పనిచేస్తోందని.. పోలీసులే డ్రోన్ల ద్వారా చిత్రికరించిన దృశ్యాలను అతనికి పంపుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
- వీటి ద్వారా భద్రతలోపాలు ఉన్న ప్రదేశాలను తెలుసుకుని కుట్రలు పన్నుతున్నారని తెలిపారు.
- ఈ సందర్బంగా టీడీపీ నేతలు మాట్లడుతూ..
- వైసీపీ పోలీసుల గుండాలతో యువగళం పాదయాత్రని అణగదొక్కే తీరును గవర్నర్కు సమగ్రంగా నివేదించామన్నారు.
- లోకేష్ పాదయాత్రను అడ్డుకునేందుకు డీఐజీ స్థాయి అధికారిని ప్రత్యేకంగా తాడేపల్లి ప్యాలెస్ నియమించిందని, ఆయన అక్రమాల చిట్టా అంతా తమ వద్ద ఉందని అన్నారు. త్వరలోనే దానిని బయటపెడతామన్నారు.
- తాడేపల్లి పెద్దలు చెప్పినంత మాత్రన పోలీసులకు మాపై చేయి చేసుకునే అధికారం ఎక్కడిదని ప్రశ్నించారు.
- తమ సహనాన్ని పోలీసుల పరీక్షించవద్దని అన్నారు.
- పోలీసుల దుశ్చర్యాల గురించి గవర్నర్కు పూర్తిగా వివరించామని అన్నారు.
- “లోకేశ్ చేపట్టిన పాదయాత్రలో స్వయంగా తాడేపల్లి నిబంధనలు పాటిస్తూ.. డీఐజీ కొల్లు రఘురామరెడ్డి వెనకాల కారులో ఉండి, అక్కడ ఉన్న పోలీసులకు ఆదేశాలు జారీ చేస్తూ అడ్డంకులు సృష్టిస్తున్నారు. మరి ఇతను ఏవిదంగా ప్రవర్తిస్తున్నారనేది ఆయనే ఆలోచించుకోవాలి.” అని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు, బోండా ఉమా అన్నారు.
“యువతలో చైతన్య వచ్చిందని పాదయాత్రను ఏదో విధంగా పోలీసులు అడ్డుకునేందుకు కుట్ర జరుపుతున్నారు. వారు పాదయాత్రను అడ్డుకునేందుకు చేయని కుట్ర లేదు. ఇందులో ప్రధానంగా లోకేశ్ భద్రతకు ప్రమాదం ఉందని భావిస్తున్నాము. ఎక్కడ అడ్డుకోవచ్చు, ఎక్కడ ఏం అల్లరి సృష్టించాటానికి అస్కారం ఉందనే అలోచనలన్ని ప్రభుత్వ అధ్వర్యంలో కుట్ర జరుగుతోంది.” అని నక్క తెదేపా పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి, అనంద్బాబు అన్నారు.