- అదానీ వివాదంపై కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- అదానీ సంస్థలపై హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదికపై కేంద్రం, సెబీ అభిప్రాయాలను సుప్రీంకోర్టు కోరింది.
- స్టాక్ మార్కెట్లో భారత మదుపర్ల ప్రయోజనాలను పరిరక్షించేలా పటిష్ఠమైన యంత్రాంగం ఉండాలని అభిప్రాయపడింది.
- అదానీ-హిండెన్బర్గ్ వ్యవహరంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు శుక్రవారం విచారించింది.
- దేశవ్యాప్తంగా దుమారం రేపిన అదానీ-హిండెన్బర్గ్ వ్యవహారంలో కేంద్రం, సెబీ అభిప్రాయాలు చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
- స్టాక్ మార్కెట్లో భారత మదుపర్ల పెట్టుబడులను పరిరక్షించేందుకు పటిష్ఠమైన వ్యవస్థ ఉండాలని అభిప్రాయపడింది.
- భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఫిబ్రవరి 13 నాటికి సెబీ ప్రతిస్పందనను కోరింది.
- ప్రస్తుతం అవలంబిస్తున్న పద్ధతులు, భవిష్యత్తులో మదుపర్లకు ఎలాంటి రక్షణ ఉంటుందో తెలియజేయాలని ధర్మాసనం సెబీని ఆదేశించింది.
- అదానీ-హిండెన్బర్గ్ వివాదంపై దాఖలైన రెండు పిటిషన్లపై శుక్రవారం సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.
- నాయమూర్తులు జస్టిస్ పీఎన్ నరసింహ, జస్టిస్ జేబి పార్ధివాలాతో కూడిన సీజేఐ ధర్మాసనం.. నిపుణులు, ఇతరులతో కూడిన ఒక కమిటీ ఏర్పాటు చేయాలని సూచించింది.
- పెట్టుబడిదారులను రక్షించడానికి పటిష్ఠమైన పద్ధతులను అవలంబించాలని నిర్దేశించింది.
- సెబీ తరపున కోర్టులో హాజరైన సొలిసిటర్ జనరల్.. మార్కెట్ రెగ్యులేటర్, ఇతర చట్టబద్ధమైన సంస్థలు అవసరమైన చర్యలన్నీ చేపడుతున్నారని నివేదించారు.
- అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి పర్యవేక్షణలో దర్యాప్తు చేయించాలని కోరుతూ న్యాయవాది విశాల్ తివారీ ఓ పిటిషన్ దాఖలు చేశారు.
- న్యాయవాది ఎంఎల్ శర్మ ఇదే తరహాలో మరో పిల్ వేశారు.
- అదానీ షేర్లు కృత్రిమంగా పతనమయ్యేందుకు హిండెన్బర్గ్ కుట్ర పన్నిందని, ఆ సంస్థ ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
- ఈ రెండు పిల్లపై సెబీ, కేంద్రానికి కొన్ని ఆదేశాలను జారీ చేసిన సుప్రీంకోర్టు.. తదుపరి విచారణను ఫిబ్రవరి 13కు వాయిదా వేసింది.