- చేతనైతే తనపై కేసు పెట్టించు కేతిరెడ్డి పెద్దారెడ్డి అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి తొడకొట్టి సవాల్ చేశారు.
- కేతిరెడ్డి పెద్దారెడ్డిపై టీడీపీ మున్సిపల్ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే, జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
- బీఎస్-3 వాహనాలకు సంబంధించి ఆయన ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి, పలు కీలక విషయాలను వెల్లడించారు.
- అనంతపురం జిల్లా తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై టీడీపీ మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
- చేతనైతే తనపై కేసు పెట్టించు.. కేతిరెడ్డి పెద్దారెడ్డి అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి తొడకొట్టి సవాల్ విసిరారు.
- తుక్కు వాహనాలకు బీమా చేయకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటున్న.. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేతనైతే తనపై కేసు పెట్టించాలని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.
- బీఎస్-3 వాహనాలకు సంబంధించిన కేసుపై నేడు జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
- జేసీ ప్రభాకర్ రెడ్డి.. కొనుగోలు చేసిన వాహనాలు, పోలీసులు పెట్టిన కేసుల ఎఫ్ఐఆర్లు, ఆర్టీఏ అధికారులు కోర్టుకు సమర్పించిన పత్రాలన్నింటినీ ఒక ప్లెక్సీపై ముద్రించి.. మీడియా ఎదుట ప్రదర్శించారు.
- వాహనాలకు బీమా చేయకుండా రిజిస్ట్రేషన్ చేయించానని, కేసు పెటిస్తామని చదువురాని తాడిపత్రి ఎమ్మెల్యే చెబుతున్నారని జేసీ మండిపడ్డారు.
- అనంతరం ఎమ్మెల్యే చెప్పినట్లుగా వాహన బీమా లేదని, నకిలీ బీమా పత్రం ఇచ్చానని తనపై ఏ అధికారి అయినా కేసు పెట్టాలని సవాల్ చేశారు.
- అధికారులంతా చట్టాలు బాగా తెలిసినవారని చెప్పుకొచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. చేతనైతే ఎమ్మెల్యే తనపై కేసు పెట్టించాలని అన్నారు.
- బీఎస్-3 వాహనాల అనుమతిని సుప్రీంకోర్టు పొడిగిస్తుందని భావించిన అశోక్ లైలాండ్ కంపెనీ దేశవ్యాప్తంగా 68 వేల వాహనాలు విక్రయించిందన్నారు.
- సుప్రీంకోర్టు తీర్పు వచ్చేసరికే అన్ని వాహనాలకు రిజిస్ట్రేషన్ పూర్తైందన్నారు.
- అయితే, దేశంలో తనపైనే మాత్రమే ఇలాంటి కేసులు పెట్టారని, దీనికి కోర్టులో అన్ని ఆధారాలతో సమాధానం చెబుతానని జేసీ తెలిపారు.
- తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి తలచెడిందని వైద్యం చేయించాలని జేసీ ప్రభాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు.