- రైతులకు 20 లక్షల కోట్ల రుణాలు
- మత్స్య కారులకి 6000 కోట్ల సహకారం
- 157 నర్సింగ్ కాలేజీలు
- చిరు ధాన్యాల వ్యాపారానికి…వ్యవసాయానికి సహకారం
- వ్యవసాయ పరపతి సంఘాలకు 2000 కోట్లు
- Ekalavya పాఠశాలలకు 38 వేల మంది ఉపాధ్యాయుల నియామకం.
- తెల్ల కార్డు దారులకు ఉచిత బియ్యం పంపిణీ ఈ సంవత్సరం కూడా కొనసాగుంపు.
- 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు.
- ఆదాయపన్ను పరిమితి రూ.7లక్షలకు పెంపు
- ఉద్యోగులకు ఊరటనిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో కీలక ప్రకటన చేశారు.
- ప్రస్తుతం ఉన్న రూ.5లక్షల ఆదాయపు పన్ను పరిమితిని రూ.7లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు.
- వైద్య కళాశాలల్లో మరిన్ని ఆధునిక సౌకర్యాలు కల్పిస్తాం.
- అధ్యాపకుల శిక్షణకు డిజిటల్ విద్యావిధానం, జాతీయ డిజిటల్ లైబ్రరీ తీసుకొస్తాం
- దేశవ్యాప్తంగా మెడికల్ కళాశాలలతో పాటు, 157 నర్సింగ్ కాలేజ్లకు అనుమతి
- త్వరలోనే ఐసీఎంఆర్ ప్రయోగశాలల విస్తృతిని మరింత పెంచుతాం.
- ఫార్మారంగంలో ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇస్తాం.
- ఈ-కోర్టులకు రూ.7వేల కోట్లు
- బ్యాటరీల నిల్వ కేంద్రాల్లో 4వేల మెగావాట్లు.
- పట్టణ మౌలిక సౌకర్యాలకు రూ.10వేల కోట్ల నిధి.
- 2030 కల్లా 5 MMT హైడ్రోజన్ తయారీ.
- తాజా బడ్జెట్లో రైల్వేలకు రికార్డు స్థాయిలో నిధులు కేటాయింపు చేస్తున్నాం
- రైల్వేల అభివృద్ధికి ఈ బడ్జెట్లో రూ.2.40లక్షల కోట్లు కేటాయిస్తున్నాం.
- రాష్ట్రాలకు వడ్డీలేని రుణాల పథకం మరో ఏడాది పొడిగింపు
- రాష్ట్రాలకు వడ్డీలేని రుణాల పథకం కోసం రూ.13.7లక్షల కోట్లు.
- కీలకమైన వంద మౌలిక వసతుల ప్రాజెక్టులకు రూ.75వేల కోట్లు.
- బడ్జెట్లో మూలధన వ్యయానికి రూ.13.5లక్షల కోట్ల కేటాయింపు.
- కోస్టల్ షిప్పింగ్కు ప్రోత్సాహం
- కాలుష్య కారక వాహనాల తొలగింపులో భాగంగా వాహన తుక్కు విధానం.
- పీఎం కౌశల్ యోజనలో భాగంగా యువతకు శిక్షణ.
- ప్రకృతి వ్యవసాయం చేసేందుకు వీలుగా కోటిమంది రైతులకు సాయం.
- 36 అంతర్జాతీయ స్థాయి నైపుణ్య కేంద్రాల ఏర్పాటు
- కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి పెద్ద పీట వేస్తాం.
- అలాగే మౌలిక వసతుల అభివృద్ధికి 33శాతం అధికంగా నిధులు కేటాయిస్తున్నాం
- ప్రభుత్వ సర్వీసులను ప్రజలకు చేరువ చేసేందుకు చర్యలు:ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- ఆదివాసీల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమం.
- ఆదివాసీ ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాల కోసం రూ.15వేల కోట్లు.
- ఏకలవ్య పాఠశాలల్లో భారీ ఎత్తున ఉపాధ్యాయ నియామకాలు చేపడతాము
- డిజిటల్ ఎపిగ్రఫీ మ్యూజియం ఏర్పాటు చేస్తాం.
- కారాగాగాల్లో మగ్గిపోతున్న పేద ఖైదీలకు ఆర్థిక చేయూత అందిస్తాం
- దేశంలో 50 టూరిస్ట్ స్పాట్ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు
- దేఖో ఆప్నా దేఖ్ పథకం ప్రారంభం
- స్వదేశీ ఉత్పత్తుల అమ్మకానికి దేశవ్యాప్తంగా యూనిటీ మాల్స్
- దేశవ్యాప్తంగా కొత్తగా 50 ఎయిర్పోర్ట్లు, హెలిప్యాడ్ల నిర్మాణం
- 5జీ సేవల అభివృద్ధికి 100 ప్రత్యేక ల్యాబ్ల ఏర్పాటు
- పీఎం కౌశల్ పథకం కింద 4లక్షల మందికి శిక్షణ
మహిళల కోసం కొత్త స్కీమ్
ఆజాదీకా అమృత మహోత్సవ్లో భాగంగా మహిళల కోసం ప్రత్యేకంగా కేంద్రం కొత్త పథకం తీసుకొచ్చింది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ను ప్రవేశపెట్టింది. రెండేళ్ల కాలానికి ఈ పథకం అందుబాటులో ఉంటుంది. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ పథకంలో డిపాజిట్పై 7.5 శాతం స్థిర వడ్డీ ఉంటుంది. గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు ఈ పథకంలో డిపాజిట్ చేయొచ్చు.👆
గృహ కొనుగోలుదారులకు గుడ్న్యూస్..
కొత్తగా ఇల్లు కొనుగోలు, కట్టుకోవాలనుకోవాలనుకునే వారికి మోదీ సర్కారు గుడ్న్యూస్ చెప్పింది. పీఎం ఆవాస్ యోజన పథకానికి ఈ సారి బడ్జెట్లో నిధులు పెంచింది. గత బడ్జెట్లో పీఎం ఆవాస్ యోజనకు 48 వేల కోట్ల రూపాయలు కేటాయించగా.. ఈ ఏడాది ఆ మొత్తాన్ని 66 శాతం పెంచి రూ.79వేల కోట్లు కేటాయించారు. వడ్డీ రేట్లు పెరిగిన వేళ గృహ కొనుగోలుదారులకు ఇది ఊరట కల్పించే అంశం.