- నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం వరుసగా ఇది ఐదోసారి
- ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్
- ఈపీఎఫ్ఓ లో సభ్యుల సంఖ్య రెంట్టింపు అయింది
- అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉంది
- జీ-20 అధ్యక్ష బాధ్యతలతో భారత్ కీలక ప్రస్థానాన్ని ప్రారంభించింది
- ప్రపంచ సవాళ్లను భారత్ ఆర్థిక వ్యవస్థ ధీటుగా ఎదుర్కొని నిలబడింది
- భారత్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిని ప్రపంచ దేశాలు గుర్తించాయి
- దేశం వృద్ధిరేటు శరవేగంగా పెరుగుతోంది- నిర్మలా సీతారామన్
- సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్డీఏ ప్రభుత్వానికి ఇదే పూర్తిస్థాయి బడ్జెట్
వరుసగా ఐదోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్ - డిజిటల్ చెల్లింపులు బాగా పెరిగాయి- నిర్మలా సీతారామన్
- సమిష్టి ప్రగతి దిశగా భారత్ వేగంగా కదులుతోంది
- దేశంలో గత 9ఏళ్లలో తలసరి ఆదాయం రెట్టింపు అయింది
- అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉంది
- ఆత్మనిర్భర్ భారత్ తో చేనేత వర్గాలకు లబ్ది చేకూరింది
- మహిళా సాధికారత దిశగా కృషి చేస్తున్నాం
- 102 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ అందించాం
- యువత ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్నాం
- అనేక స్టార్టప్స్ యూనికార్న్స్ గా ఎదుగుతున్నాయి
- కళాకారులు, హస్త కళాకారులకు ప్రత్యేక రాయితీలు ఇస్తున్నాం
- ఎంఎస్ఎంఈ లతో కళాకారుల అనుసంధానం, వారి బ్రాండ్ ప్రమోషన్ కు చర్యలు
- టూరిజం రంగంలో భారత్ కు అనేక అవకాశాలు ఉన్నాయి
- టూరిజం ప్రోత్సాహానికి విస్తృత చర్యలు చేస్తున్నాం
- హరిత ఇంధనం కోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం
- గ్రీన్ గ్రోత్ కోసం అన్ని రకాల చర్యలు, ఉద్యోగ అవకాశాలు
- సప్త రుషుల రీతిలో ఏడు అంశాలకు బడ్జెట్ లో ప్రాధాన్యత ఇచ్చాం
- సమిష్టి ప్రగతి దిశగా అనేక చర్యలు చేపడుతున్నాం
- రైతులు, మహిళలు, యువత, వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత
- గ్రీన్ ఎనర్జీకి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తోంది
- పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించేలా సంస్కరణలు
- వ్యవసాయరంగంలో సవాళ్లు ఎదుర్కొనేందుకు ప్రణాళిక
- రైతుల కోసం కిసాన్ సమ్మాన్ నిధిని మరింత పెంచుతున్నాం
- వ్యవసాయంలో ఆధునికీకరణ దిశగా అడుగులు వేస్తున్నాం
- క్లీన్ ప్లాంట్ ప్రోగ్రాంకు 2వేల కోట్లు కేటాయింపు
- మత్స్యకారుల అభివృద్ధి కోసం భారీగా నిధుల కేటాయింపు
- మహిళల కోసం మరిన్ని పథకాలు
- వ్యవసాయ స్టార్టప్స్ కు చేయూత, ప్రత్యేక నిధి ఏర్పాటు
- రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు
- పత్తి సాగు మెరుగుదల కోసం ప్రత్యేక చర్యలు
- పత్తి కోసం ప్రత్యేకంగా మార్కెటింగ్ సదుపాయం
- అత్యంత విలువ కలిగిన ఉద్యాన పంటలకు చేయూత
- చిరు ధాన్యాల ప్రాధాన్యత పెంచేందుకు చర్యలు
- సిరిధాన్యాల ఎగుమతిలో భారత్ ది అగ్రస్థానం
- జొన్న, రాగి, బార్లీ ఇలా ఎన్నో సిరిధాన్యాలను పండిస్తున్నాం
- 11.7 కోట్ల ఉచిత టాయిలెట్స్ నిర్మించి ఇచ్చాం
- ఎస్టీ వర్గాలకు రూ.15వేల కోట్ల కేటాయింపు
- దళితుల అభివృద్ధికి ప్రత్యేక పథకాలు
- ఏకలవ్య మోడల్ స్కూళ్లలో 38,800 టీచర్ల నియామకం
- పీఎం ఆవాస్ యోజనకు 66 శాతం నిధుల పెంపు
- 81 లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూపులను ఏర్పాటు చేస్తాం
- పీఎం విశ్వకర్మ యోజన తీసుకొస్తాం
- రైల్వేలకు రూ.2.40 లక్షల కోట్ల కేటాయింపు
- కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి పెద్దపీట
- మౌలిక వసతుల అభివృద్ధికి 33 శాతం అధిక నిధులు
- మూలధనం కింద రూ.10 లక్షల కోట్లు
- పేద ఖైదీలకు బెయిల్ పొందేందుకు ఆర్థిక సాయం
- రైల్వేకు రికార్డ్ స్థాయిలో నిధుల కేటాయింపు
- దేశవ్యాప్తంగా 157 కొత్త నర్సింగ్ కాలేజీల ఏర్పాటు
- ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల అభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన
- సామాన్యుల సాధికారతే బడ్జెట్ లక్ష్యం
- యువత కోసం నేషనల్ డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు
- సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక చేయూత
- ప్రైవేట్, ప్రభుత్వ పరిశోధనల కోసం ఐసీఎంఆర్ ల్యాబ్స్
- పాఠశాల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నేషనల్ డిజిటల్ లైబ్రరీలు
- పంచాయతీ స్థాయిలో ఏర్పాటు
- విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెంచేందుకు చర్యలు
- ప్రాంతీయ భాషల్లో ఎన్బీటీ ద్వారా మరిన్ని పుస్తకాలు
- పీవీటీజీ గిరిజనుల కోసం ప్రత్యేక చర్యలు
- మారుమూల గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం రూ.15వేల కోట్లు
- ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు
- మేక్ ఏ వర్క్ మిషన్ ప్రారంభం
- స్టార్టప్ లకు ప్రత్యేక ప్రోత్సాహం, స్టార్టప్ లకు రిస్క్ తగ్గించేందుకు కృషి
- దేశవ్యాప్తంగా కొత్తగా 50 ఎయిర్ పోర్టులు, హెలిప్యాడ్ ల నిర్మాణం
- 5జీ సేవల అభివృద్ధి 100 ప్రత్యేక ల్యాబ్ ల ఏర్పాటు
- కర్ణాటకలోని వెనుకబడ్డ ప్రాంతాలకు సాగు రంగానికి రూ.5,300 కోట్లు
- నేషనల్ హైడ్రోజన్ గ్రీన్ మిషన్ కు రూ.19,700 కోట్లు
- విద్యుత్ రంగానికి రూ.35వేల కోట్లు
- సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహం
- నిరుద్యోగుల కోసం పీఎం కౌశల్ పథకం.. నాలుగో దశ ప్రారంభం
- పీఎం కౌశల్ పథకం కింద 4 లక్షల మందికి శిక్షణ
- దేశంలో 50 టూరిస్ట్ స్పాట్ ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు
- దేఖో ఆప్నా దేశ్ పథకం ప్రారంభం
- స్వదేశ ఉత్పత్తుల అమ్మకానికి దేశవ్యాప్తంగా యూనిటీ మాల్స్
- గిరిజన మిషన్ కు రూ.10వేల కోట్లు
- వ్యవసాయ రుణాలు రూ.20 లక్షల కోట్లు