- రానున్న 24 గంటల్లో చెదురుముదురు వర్షాలు
- తీవ్ర అల్పపీడనం సోమవారం
ఉదయానికి నైరుతి బంగాళాఖాతం లో ప్రవేశించి వాయుగుండంగా బలపడింది. - ఇది మధ్యాహ్ననికి ట్రింకోమలైకు 610 కిలోమీటర్లు, తమిళనాడులోని కరైకల్కు 820 కిలోమీటర్లు తూర్పు ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది.
- వాయుగుండం మంగళవారం సాయంత్రం వరకు పశ్చిమ వాయువ్య దిశగా పయనించి…
ఆ తరువాత దక్షిణ నైరుతిగా దిశ మార్చుకుని ఫిబ్రవరి ఒకటో తేదీ బుధవారం ఉదయం శ్రీలంక లో తీరం దాటనున్నదని వాతావరణ శాఖ తెలిపింది. - దీని ప్రభావంతో ఏపీలోని కృష్ణపట్నం, నిజాంపట్నం, మచిలీపట్నం, కాకినాడ, గంగవరం, విశాఖపట్నం ఓడరేవుల్లో ఒకటో నంబరు భద్రతా సూచిక ఎగురవేశారు.
- వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా సోమవారం వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.