మద్యం దుకాణాలు తనఖా పెట్టి అప్పులా..!టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు, చింతకాయల అయ్యన్నపాత్రుడు అధికార పార్టీ పై ధ్వజమెత్తారు.
- రాష్ట్రం నుంచి సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్లే కాకుండా, అండర్ వేర్ కంపెనీలు కూడా రాష్ట్రం నుంచి తరలిపోతున్నాయని ఎద్దేవా చేశారు.
- అలాగే పక్క రాష్ట్రం ఐటీ మంత్రి ఏం చేస్తున్నారో చూసి అమర్నాధ్ నేర్చుకోవాలని హితవుపలికారు.
- దూరంగా ఉండి ఎన్నికల వేళ మళ్లీ పార్టీకి చేరువ కావడం సరికాదని గంటా శ్రీనివాసరావును ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.
- సాఫ్ట్వేర్, హార్డ్వేర్లే కాకుండా, అండర్వేర్ కంపెనీలు కూడా రాష్ట్రం నుంచి తరలిపోతున్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు.
- జాకీ అండర్వేర్ కంపెనీని కేటీఆర్ తెలంగాణాకు పట్టుకుపోయారని ఆయన గుర్తు చేశారు.
- మద్యం దుకాణాలను 25 ఏళ్లకు తనఖా పెట్టి 8 వేల 7 వందల కోట్లు అప్పు తెస్తారా అంటూ మండిపడ్డారు.
- పక్క రాష్ట్రం ఐటీ మంత్రి ఏం చేస్తున్నారో చూసి అమర్నాథ్ నేర్చుకోవాలని హితవు పలికారు.
- తమలాంటి వారిని తిట్టడానికే అమర్నాథ్కు మంత్రి పదవి ఇచ్చారని దుయ్యబట్టారు.
- త్వరలో టీడీపీ బీసీ నేతలు సమావేశమై, 3 ప్రాంతాల్లో సదస్సులు పెడతామని అయ్యన్నపాత్రుడు తెలిపారు.
- పార్టీలోకి అందరూ రావాలి, కష్టకాలంలో పార్టీ కోసం పని చేయాలనేదే తమ ఆకాంక్ష అని తెలుగుదేశం సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు.
- తాము ఎవరికీ వ్యతిరేకం కాదన్న అయ్యన్న.. ఇన్నాళ్లు దూరంగా ఉండి ఎన్నికల వేళ మళ్లీ పార్టీకి చేరువ కావడం సరికాదని గంటా శ్రీనివాసరావును ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.
- ఎవరైనా పార్టీకి అండగా ఉండాలనే తాము కోరుకుంటామన్నారు.