ఏపీలో నేటి నుండి ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్.!
- గ్రామ, వార్డు సచివాలయాలు, పాఠశాలల్లో ప్రత్యేక కౌంటర్లు.
- నేటి నుంచి 24వ తేదీ వరకు అవకాశం.
- రెండో విడతగా ఫిబ్రవరి 7 నుంచి 10 వరకూ..
- పదేళ్లుగా అప్డేట్ చేసుకోని వారికోసం ప్రత్యేకంగా ఏర్పాటు..
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
- ఆధార్ కార్డులో ఏవైనా తప్పులు దొర్లితే నేటి నుంచి అప్డేట్ చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది.
- జనవరి 19, 20, 21, 23, 24 తేదీల్లో వరుసగా ఐదు రోజుల పాటు ఆధార్ అప్డేట్ చేయనున్నారు.
- ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నిసచివాలయాల్లో ప్రత్యేక క్యాంప్లు నిర్వహించనున్నట్లు ఏపీ సర్కార్ వెల్లడించింది.
- అనంతరం మళ్లీ ఫిబ్రవరి 7 నుంచి 10వ తేదీ వరకు నాలుగు రోజులపాటు రెండో విడత క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపింది.
- ఆధార్లో ఎవైనా తప్పుటు దొర్లితే ఏన్నో పనులు పెండింగ్లో పడిపోతుంటాయి. ఆధార్ సెంటర్లకు వెళితే అక్కడ రద్దీ రిత్యా పనులు సకాలంలో అవక ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు.
- రాష్ట్రంలో దాదాపు 80 లక్షల మంది ఆధార్ అప్డేట్ చేసుకోని వారున్నట్లు సమాచారం. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు ప్రత్యేక క్యాంపులతో ఆధార్ అప్డేటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.