తూర్పుగోదావరి జిల్లా కోడి పందాల్లో విషాదం నెలకొంది. నల్లజర్ల మండలం అనంతపల్లిలో పందెం కోడి కత్తి గుచ్చుకుని పద్మారావు అనే వ్యక్తి మృతి చెందాడు. దీంతో పందెం రాయుళ్లు అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు పద్మారావు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కోడికి కత్తి కడుతున్న సమయంలో కోడి ఎగరడంతో పక్కనే ఉన్న పద్మారావుకు కత్తి గుచ్చుకున్నట్లు తెలుస్తోంది.