కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ఆయన సతీమణి భువనేశ్వరి ,వారి తనయుడు యువనేత ప్రణయ్ రెడ్డి దర్శించుకున్నారు. సోమవారం రాత్రి కుటుంబంతో పాటు బంధుమిత్రులతో తిరుమల చేరుకున్న వారు మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం విశ్వేశ్వరరెడ్డి-భువనేశ్వరి దంపతులకు వేద పండితులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.